బైక్ లేదా కారు ఆర్సీ పోయిందా? ఇంట్లో కూర్చునే ఇలా అప్లై చేయండి

మీ బైక్ లేదా కారు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (ఆర్సీ) పోయిందా? అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆర్సీ అనేది ఒక వాహనానికి అత్యంత కీలకమైన డాక్యుమెంట్. ఇది మీ పేరు మీద వాహనం రిజిస్టర్ అయిందని చెప్పడానికి ఇదే మూలం. ఈ సర్టిఫికేట్‌ను రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీస్ (ఆర్టీవో) జారీ చేస్తుంది. ఒకవేళ మీ ఆర్సీ పోయినా లేదా దొంగిలించబడినా, మీరు సులభంగా డూప్లికేట్ ఆర్సీ కోసం ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. దీని కోసం మీరు ఎక్కడికీ తిరగాల్సిన పనిలేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వాసులు ఇంట్లో కూర్చునే డూప్లికేట్ ఆర్సీ కోసం ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

శ్రీలంకలో కూడా ఏథర్ దుమ్మురేపుతోంది.. కొత్త 450X 2025 ఎడిషన్ లాంచ్

భారతదేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు కొత్త యుగాన్ని తెచ్చిన ఏథర్ ఎనర్జీ, ఇప్పుడు తన ప్రయాణాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. బెంగళూరుకు చెందిన ఈ ప్రముఖ కంపెనీ, శ్రీలంకలో 2025 ఏథర్ 450X మోడల్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఇది కేవలం ఒక కొత్త స్కూటర్ లాంచ్ మాత్రమే కాదు, ఏథర్ తన గ్లోబల్ ప్రయాణంలో వేసిన ఒక పెద్ద మైలురాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ఏథర్ ఇప్పటికే మంచి గుర్తింపును సంపాదించగా, శ్రీలంకలో ఈ లాంచ్‌తో కంపెనీ తన ఉనికిని మరింత బలంగా చాటుకుంది. 450X స్కూటర్ తన ప్రత్యేకమైన డిజైన్, శక్తివంతమైన పనితీరు, లేటెస్ట్ టెక్నాలజీతో వినియోగదారుల మనసులను గెలుచుకుంటోంది. ముఖ్యంగా, ఎలక్ట్రిక్ స్కూటర్లను కోరుకునే యువతలో ఇది మంచి డిమాండ్‌ను సొంతం చేసుకుంది.

జూలైలో MG కామెట్ EV షాక్.. ఒక్క నెలలోనే 24% సేల్స్ పడిపోయాయి!

భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో మంచి గుర్తింపు సంపాదించుకున్న మోడళ్లలో MG కామెట్ EV ఒకటి. తక్కువ ధర, కాంపాక్ట్ సైజు, నగరాల్లో సులభంగా డ్రైవ్ చేయగలిగే డిజైన్ వలన ఈ కారు అనేక మంది కస్టమర్లకు మొదటి ఎంపికగా మారింది. ముఖ్యంగా మెట్రో నగరాల రద్దీ రోడ్లపై చిన్న సైజులో ఉండటం వలన ఎక్కడైనా సులువుగా పార్క్ చేసుకోవచ్చు. ఇదే కాకుండా, MG అందించిన ఆధునిక సాంకేతిక ఫీచర్లు ఈ కారును మరింత ప్రత్యేకంగా నిలబెట్టాయి. అయితే, ఈసారి జూలై 2025 MG కామెట్ EV అమ్మకాల పరంగా అంతగా బాగోలేదు. గణాంకాల ప్రకారం, జూలై 2025లో కేవలం 912 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఇది గత సంవత్సరం ఇదే నెలలో అమ్ముడైన 1,200 యూనిట్లతో పోలిస్తే 288 కార్లు తక్కువ.

ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఫీచర్‌తో వస్తున్న కార్లు ఇవే

కొత్త కారు కొనడానికి వెళ్లేవారు ఇప్పుడు ఫీచర్లు, సేఫ్టీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒకప్పుడు ఏసీ లేకుండా కూడా కార్లు వచ్చేవారు. కానీ ఇప్పుడు ప్రతి కారులో ఏసీ ఒక ప్రామాణిక ఫీచర్ అయిపోయింది. ఎందుకంటే, ఏసీ మన దైనందిన జీవితంలో ఒక భాగం అయిపోయింది. అవసరానికి అనుగుణంగా కారు లోపలి భాగాన్ని చల్లబరచడానికి లేదా వేడి చేయడానికి ఎయిర్ కండిషనర్లు ఉపయోగపడతాయి.
Advertisement

బైక్ సెగ్మెంట్‌లో చరిత్ర సృష్టించిన హీరో గ్లామర్

భారతీయ మార్కెట్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్‌లలో హీరో మోటోకార్ప్ ఎప్పుడూ ముందుంటుంది. ఇప్పుడు హీరో సరికొత్త టెక్నాలజీతో తన 2025 హీరో గ్లామర్ ఎక్స్ 125 బైక్‌ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ బైక్ బేస్ డ్రమ్ వేరియంట్ ధర రూ.89,999 (ఎక్స్-షోరూమ్)గా ఉంది, టాప్-స్పెక్ డిస్క్ వేరియంట్ ధర రూ.లక్ష (ఎక్స్-షోరూమ్)గా ఉంది. స్టైలిష్ డిజైన్‌తో పాటు అనేక కొత్త ఫీచర్లతో ఈ బైక్ వచ్చింది.

పాత బైక్‌లకు E20 పెట్రోల్ నష్టం చేయకుండా ఇలా చేయండి

భారతదేశంలో వాహన రంగంలో ఇప్పుడు జీఎస్టీ సవరణలు, E20 ఇంధనం గురించి విస్తృతంగా చర్చ జరుగుతోంది. కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు, క్రూడాయిల్ దిగుమతులను తగ్గించే లక్ష్యంతో 20 శాతం ఇథనాల్ కలిపిన E20 పెట్రోల్ భారతదేశంలో కొత్త ప్రమాణంగా మారబోతోంది. E20 పెట్రోల్ మంచిదే అయినప్పటికీ, పాత మోటార్‌సైకిళ్లకు ఇది ఒక పెద్ద సవాల్‌గా నిలుస్తోంది. ఎందుకంటే, ఇథనాల్ అనేది తేమను త్వరగా గ్రహిస్తుంది. ఇది పాత బైక్‌ల లోహ భాగాలు, రబ్బరు సీల్స్, ఫ్యూయల్ సిస్టమ్‌కు నష్టం కలిగించవచ్చు.

33 కి.మీ మైలేజ్ ఇచ్చే కారు.. కానీ ప్రజలు కొనడమే మానేశారు!

మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో (Maruti Suzuki S Presso) మార్కెట్లోకి వచ్చినప్పుడు, ఇది SUV స్టైల్ లుక్స్‌తో హ్యాచ్‌బ్యాక్ కాంపాక్ట్ సైజ్ కలిగిన ప్రత్యేకమైన కారు అని చాలా మంది భావించారు. అందుకే దీన్ని చాలామంది మైక్రో SUV అని కూడా పిలిచారు. కానీ కాలక్రమేణా వినియోగదారుల అభిరుచులు మారడం ప్రారంభించాయి. ముఖ్యంగా నగరాల్లో ప్రయాణించే వారు కొత్తగా వస్తున్న ఎలక్ట్రిక్ వాహనాల వైపు ఆకర్షితులయ్యారు. ఫ్యూయల్ ఖర్చులు పెరగడం, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, తక్కువ నిర్వహణ ఖర్చులు.. ఇవన్నీ EVలకు పెద్ద ప్లస్ పాయింట్లుగా మారాయి. ఈ నేపథ్యంలో ఎస్-ప్రెస్సో తన మార్కెట్లో మెల్లగా వెనుకబడిపోతోంది. జూలై 2025లో విడుదలైన అమ్మకాల గణాంకాలు దీనికి స్పష్టమైన ఉదాహరణ.

చరిత్ర సృష్టించిన మారుతి ఫ్రాంక్స్

భారతదేశంలో మారుతి సుజుకికి ఉన్న పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు మారుతి సుజుకికి చెందిన కాంపాక్ట్ ఎస్‌యూవీ ఫ్రాంక్స్ ఒక కొత్త రికార్డును నెలకొల్పింది. ఈ మోడల్ ఉత్పత్తి 5 లక్షల యూనిట్లను దాటిందని కంపెనీ ప్రకటించింది. మార్చి 2023లో విడుదలైన ఫ్రాంక్స్ అప్పటి నుంచీ వినియోగదారుల ఫేవరెట్‌గా మారింది.
Advertisement

వింటేజ్ బైక్‌తో ఎంట్రీ ఇచ్చిన డీకే శివకుమార్.. బెంగళూరులో హల్‌చల్ చేసిన రైడ్

బెంగళూరు నగరాన్ని దేశంలోని ఐటీ హబ్‌గా, స్టార్టప్‌ల రాజధానిగా ప్రపంచం గుర్తించింది. ఈ గుర్తింపు పొందినప్పటి నుండి నగర జనాభా ఊహించని రీతిలో పెరుగుతూ వస్తోంది. ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో ఉద్యోగార్థులు, విద్యార్థులు, వ్యాపారవేత్తలు ఈ నగరంలోకి అడుగుపెడుతున్నారు. ఫలితంగా మౌళిక సదుపాయాలపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. రవాణా వ్యవస్థపై ఈ ఒత్తిడి అత్యధికంగా కనిపిస్తోంది. ఉదయం ఉద్యోగాలకు వెళ్ళే సమయం, సాయంత్రం తిరిగి వచ్చే సమయం .. ఈ రెండు పీక్ అవర్స్‌లో నగరమంతా వాహనాల రద్దీతో నిండిపోతుంది. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఆగిపోవడం, ఒక్కో కిలోమీటర్ కదలడానికి అరగంట వేచిచూడడం, అత్యవసర పనులకీ సమయానికి చేరుకోలేక ఇబ్బంది పడడం, ఇవన్నీ బెంగళూరు జీవనశైలిలో భాగమైపోయాయి.

హార్లీ-డేవిడ్‌సన్ స్ట్రీట్ బాబ్ 117 విడుదల..అంత పెట్టి కొంటారా ?

ప్రపంచంలోనే ప్రఖ్యాత టూ వీలర్ తయారీ సంస్థ అయిన అమెరికన్ హార్లీ-డేవిడ్‌సన్ తన సరికొత్త స్ట్రీట్ బాబ్ 117 మోడల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ బైక్ స్టైల్, ఇంజిన్ కెపాసిటీ, ధర ఇప్పుడు భారతదేశంలో చర్చనీయాంశంగా మారాయి. ఎందుకంటే ఈ బైక్ ధరతో మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీ టాప్ వేరియంట్‌ను కొనుగోలు చేయవచ్చు.

GST తగ్గితే.. ఆల్టో K10, టియాగో, సెలెరియో ధరలు ఇంత వరకు పడిపోతాయా?

ప్రస్తుతం భారతదేశంలో వస్తువులు, సేవలపై ప్రభుత్వం 5%, 12%, 18%, 28% అనే నాలుగు ప్రధాన పన్ను రేట్లను అమలు చేస్తోంది. ఈ స్లాబుల ఆధారంగా పన్ను వసూలు చేస్తున్నారు. ముఖ్యంగా ఆటోమొబైల్ రంగంలో కార్లు, బైక్‌లు, స్కూటర్లు వంటి వాహనాలపై 28 శాతం వరకు జీఎస్టీ పన్ను ఉంది. దీంతో కస్టమర్లు కొనుగోలు సమయంలో అదనపు భారం మోయాల్సి వస్తోంది. అయితే, ఇప్పుడు పరిస్థితి మారబోతుందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఈ ఏడాది అక్టోబర్ నాటికి జీఎస్టీ రేట్లను తగ్గించి, మొత్తం పన్ను వ్యవస్థను సరళీకృతం చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ కొత్త సంస్కరణల కింద, ఇప్పటివరకు ఉన్న నాలుగు వేర్వేరు రేట్ల బదులు, పన్ను కేవలం రెండు విస్తృత వర్గాలుగా అమలు చేయబడే అవకాశం ఉంది.

ఇన్నోవాను మించి ఫీచర్లు.. టయోటా కొత్త కారు వచ్చేసింది

భారతీయ కస్టమర్లకు బాగా ఇష్టమైన ఆటోమొబైల్ బ్రాండ్లలో టయోటా ఒకటి. కేవలం కొన్ని మోడళ్లతోనే ఈ కంపెనీ భారతీయ మార్కెట్‌లో మంచి పేరు సంపాదించుకుంది. క్వాలిస్, ఇన్నోవా, ఫార్చ్యూనర్, ఎటియోస్ లివా వంటి మోడళ్లతో టయోటా ప్రజల మనసులలో స్థానం సంపాదించింది. ఈ జాబితాలో టయోటా కామ్రీకి కూడా ఒక ప్రత్యేక స్థానం ఉంది. 2019 నుండి భారతదేశంలో లభిస్తున్న ఈ కారు మంచి అమ్మకాలను సాధిస్తోంది. ఇది ప్రీమియం విభాగంలో ఉన్నందున, మెర్సిడెస్ బెంజ్, ఆడి, బీఎమ్‌డబ్ల్యూ వంటి లగ్జరీ కార్లకు పోటీ ఇస్తుంది.
Advertisement

ఇండియాలోనే తొలిసారి ఏఐ టెక్నాలజీతో వచ్చిన ఎలక్ట్రిక్ వాహనాలు

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహన రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్న సమయంలో, కొత్త కంపెనీలు తమ సృజనాత్మకతతో వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. అలాంటి కంపెనీలలో ఒకటైన E3 Electric.Ai తాజాగా రెండు విభిన్నమైన ఎలక్ట్రిక్ వాహనాలను భారతీయ మార్కెట్లోకి ఆవిష్కరించింది. వీటిలో ఒకటి దేశంలో మొట్టమొదటి స్మార్ట్ ఎలక్ట్రిక్ ఫ్యామిలీ స్కూటర్, మరొకటి డెలివరీ, లాజిస్టిక్స్ రంగాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించబడిన బలమైన క్రాస్ఓవర్ డెలివరీ మోపెడ్. ఫ్యామిలీ స్కూటర్ విషయానికి వస్తే, ఇది పూర్తిగా భవిష్యత్ తరహా డిజైన్‌తో ఆకర్షణీయంగా తీర్చిదిద్దబడింది. కుటుంబ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ స్కూటర్, కేవలం ఒక ప్రయాణ సాధనం మాత్రమే కాదు, ఇంటెలిజెంట్ AI సాంకేతికతతో నిండిన ఒక స్మార్ట్ వాహనం.

సేఫ్టీకి 4 స్టార్.. బడ్జెట్‌లో లభిస్తున్నా తగ్గిన అమ్మకాలు

టాటా టియాగో (Tata Tiago) భారత మార్కెట్లో ఎప్పటినుంచో ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న హ్యాచ్‌బ్యాక్. చిన్న కారు కావాలి, కానీ కాంప్రమైజ్ లేకుండా సేఫ్టీ, మైలేజ్, కంఫర్ట్ కూడా కావాలి అనుకునే ఫ్యామిలీలకు ఇది ఎప్పుడూ సరైన ఎంపికగా నిలిచింది. టాటా మోటార్స్ తమ మేడ్ ఇన్ ఇండియా ఇమేజ్‌ను బలంగా నిలబెట్టడంలో టియాగో కీలక పాత్ర పోషించింది. స్టైలిష్ డిజైన్, బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైసింగ్, రోజువారీ అవసరాలకు సరిపోయే మైలేజ్ టాటా టియాగోను మిలియన్ల మంది వినియోగదారులకు ఇష్టమైన కారుగా మార్చాయి. అయితే ప్రస్తుత జూలై 2025లో టియాగో అమ్మకాలలో స్వల్పంగా తగ్గుదల నమోదైంది.

71.33 కి.మీ. మైలేజీతో యమహా స్కూటర్

భారతదేశంలో స్కూటర్ మార్కెట్‌ను తమ గుప్పిట్లోకి తీసుకోవడానికి జపనీస్ టూ వీలర్ తయారీ సంస్థ యమహా కొత్త వ్యూహాలతో ముందుకు సాగుతోంది. ఫాసినో, రే ZR, ఏరోక్స్ అనే మూడు మోడళ్లతోనే మంచి అమ్మకాలను సాధిస్తున్న ఈ కంపెనీ ఇప్పుడు తమ మోడళ్లను అప్‌డేట్ చేస్తూ మార్కెట్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. తాజాగా ఫ్యామిలీ, మహిళా కస్టమర్లకు ఇష్టమైన ఫాసినో హైబ్రిడ్‌కు కొత్త అప్‌డేట్‌లను ఇచ్చిన యమహా, ఇప్పుడు యువతకు బాగా నచ్చే రే ZR స్కూటర్ కొత్త వెర్షన్‌ను కూడా మార్కెట్‌లోకి విడుదల చేసింది.

సులభంగా నడిచే, ఎక్కువ మైలేజ్ ఇచ్చే రైడ్ షేరింగ్ బెస్ట్ బైక్స్ ఇవే!

ప్రస్తుతం మన దేశంలో యువతలో చాలా మంది ఓలా బైక్, ఉబెర్, రాపిడో వంటి రైడ్-షేరింగ్ ప్లాట్‌ఫామ్‌లలో చేరుతున్నారు. చదువుతో పాటు అదనంగా సంపాదించాలనుకునే వారు, ఉద్యోగం వెతుకుతూ ఉన్న వారు లేదా పార్ట్‌టైమ్‌గా ఆర్థిక లాభం పొందాలనుకునే వారు ఈ అవకాశాన్ని గట్టిగా పట్టుకుంటున్నారు. నిజానికి, ఈ రంగం ఇప్పుడు ఫాస్ట్ మనీ, ఫ్లెక్సిబుల్ అవర్స్ కోసం చూస్తున్న వారికి ఒక కొత్త మార్గాన్ని చూపుతోంది. అయితే, ఈ పనిని ప్రారంభించే ముందు ప్రతి ఒక్కరూ ఒక ముఖ్యమైన ప్రశ్నను ఆలోచించాలి.. ఏ బైక్‌ను ఎంచుకోవాలి? ఎందుకంటే ఇక్కడ ఉపయోగించే బైక్ కేవలం ఒక వాహనం మాత్రమే కాదు, అది మీకు రోజువారీ ఆదాయం తెచ్చిపెట్టేది. కాబట్టి, బైక్ మైలేజ్ బాగుండాలి, మెయింటెనెన్స్ తక్కువగా ఉండాలి, అలాగే పట్టణ ట్రాఫిక్‌లో ఈజీగా నడపగలిగేలా ఉండాలి.
Advertisement

మారుతి నుంచి టాటా వరకు భారీగా తగ్గనున్న కార్ల ధరలు

భారతదేశంలో మళ్ళీ చిన్న కార్లకు గిరాకీ పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే, కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోయే కొత్త జీఎస్టీ సంస్కరణల కారణంగా చిన్న కార్లు కొనడం చాలా చౌకగా మారనుంది. ప్రస్తుతం చిన్న కార్లపై ఉన్న అధిక పన్ను భారాన్ని తగ్గించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.

డిజైన్, ఫీచర్లు టాప్ క్లాస్.. కానీ అమ్మకాల్లో వెనుకబడిన టాటా టిగోర్!

భారతీయ ఆటోమొబైల్ రంగంలో టాటా మోటార్స్ (TATA MOTORS) ఎప్పటినుంచో భద్రతకు ప్రతీకగా నిలుస్తూ వస్తోంది. ప్రయాణికుల రక్షణ కోసం అత్యున్నత సేఫ్టీ ప్రమాణాలను పాటించే కార్లను తయారు చేయడంలో ఈ కంపెనీ ఎప్పుడూ ముందంజలో ఉంటుంది. గడచిన కాలంలో ఒకప్పుడు దేశీయ మార్కెట్లో అగ్రస్థానాన్ని సంపాదించిన టాటా, ప్రస్తుతం మాత్రం పోటీ తీవ్రత కారణంగా కొంచెం వెనుకబడింది. మారుతీ సుజుకి, హ్యుందాయ్, మహీంద్రా వంటి కంపెనీలు తమ అమ్మకాలతో ముందుకు దూసుకెళ్తుంటే, టాటా మోటార్స్ ఇప్పుడు నాల్గవ స్థానంలో నిలవాల్సి వచ్చింది. అయితే, టాటా తన పోటీని ఎదుర్కొనేందుకు నిరంతరం కొత్త ప్రయోగాలు చేస్తోంది. ICE ఆధారిత వాహనాలకే పరిమితం కాకుండా, ఎలక్ట్రిక్ మోడళ్లను కూడా వరుసగా మార్కెట్లోకి తీసుకువస్తూ కస్టమర్లను ఆకర్షించడానికి కృషి చేస్తోంది.

టోల్ టెన్షన్ అక్కర్లేదు.. కొత్త FASTag పాస్‌తో సులభమైన ప్రయాణం

ప్రైవేట్ వాహనాల డ్రైవర్ల కోసం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక అదిరిపోయే కొత్త సిస్టమ్ తీసుకొచ్చింది. అదే.. ఫాస్టాగ్ బేస్డ్ యాన్యువల్ హైవే టోల్ పాస్. ఇది కారు, జీప్, వ్యాన్ వంటి నాన్ కమర్షియల్ వెహికల్స్‎కు మాత్రమే వర్తిస్తుంది. ఈ పాస్‌తో ఇకపై టోల్ ఫీజులు చెల్లించడానికి FASTag కార్డును మళ్ళీ మళ్ళీ రీఛార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు.

కైలాక్ హవా.. పోటీదారులందరినీ షాక్‌కు గురిచేసిన జూలై సేల్స్!

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో పెరుగుతున్న పోటీకి తగినట్టుగా, స్కోడా ఇండియా (Skoda India) తన బలాన్ని మరింత బలపరచుకుంటోంది. దేశీయంగా SUVల డిమాండ్ విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో, కంపెనీ వినియోగదారులను ఆకట్టుకునేలా కొత్త మోడళ్లను వరుసగా మార్కెట్లోకి తీసుకొస్తోంది. ఈ క్రమంలోనే స్కోడా ఇండియా గత సంవత్సరం నవంబర్ 2024లో ఎంతో అట్టహాసంగా కైలాక్ (Kylaq) అనే కాంపాక్ట్ SUVని విడుదల చేసింది. 4 మీటర్ల లోపు సైజులో వచ్చిన ఈ కారు, ప్రీమియం ఫీచర్లు, ఆకర్షణీయమైన డిజైన్, శక్తివంతమైన ఇంజిన్ పనితీరుతో SUV సెగ్మెంట్‌లో ఒక ప్రత్యేక గుర్తింపు సాధించింది. విడుదలైనప్పటి నుంచి కైలాక్ మార్కెట్లో మంచి స్పందనను తెచ్చుకుంది. యూత్ నుంచి ఫ్యామిలీ కస్టమర్ల వరకు అందరినీ ఆకట్టుకోవడంలో ఈ SUV విజయవంతమైంది.
Advertisement

రేర్ ఎర్త్ మెటల్స్ పై భారత్ మెగా ప్లాన్

ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలు, రక్షణ రంగ పరికరాలు, ఇతర అధునాతన సాంకేతిక పరికరాలలో రేర్ ఎర్త్ మెటల్స్ వినియోగం విపరీతంగా పెరిగింది. ఈ లోహాల కోసం భారతదేశం ఎక్కువగా దిగుమతులపై ఆధారపడుతోంది. ఈ నేపథ్యంలో దేశీయంగా ఉత్పత్తిని పెంచడానికి, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి కొత్త ఊపునిచ్చేందుకు ప్రభుత్వం ఒక కొత్త వ్యూహాన్ని రూపొందిస్తోంది. దీనిపై ఫ్రమ్ ఎక్స్‌ట్రాక్షన్ టు ఇన్నోవేషన్ అనే నివేదికలో ప్రైమస్ పార్ట్‌నర్స్ సంస్థ కొన్ని ముఖ్యమైన సిఫార్సులను చేసింది.

రూ.10 లక్షల లోపు సురక్షితమైన కార్లు ఇవే

గతంలో ప్రజలు కారు కొనేటప్పుడు మైలేజ్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. కానీ, ఇప్పుడు సేఫ్టీ అనేది ఒక ముఖ్యమైన అంశంగా మారింది. ఈ కారణంగానే గ్లోబల్ ఎన్‌క్యాప్, ఆసియన్ ఎన్‌క్యాప్ వంటి క్రాష్ టెస్ట్ ఏజెన్సీలు కార్లకు సేఫ్టీ రేటింగ్‌లను ఇస్తున్నాయి. ఈ ఏజెన్సీలు నిర్వహించే క్రాష్ టెస్టులలో అత్యధిక రేటింగ్ పొందిన కొన్ని కార్లు ఇప్పుడు భారతీయ మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా, రూ. 10 లక్షల లోపు ధరలో లభించే కొన్ని 5-స్టార్ రేటింగ్ కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

యూత్ నుంచి ఫ్యామిలీ వరకు హాట్ ఫేవరెట్ కారు ధర పెరిగింది

టయోటా కిర్లోస్కర్ మోటార్స్ (TKM) భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఎప్పటినుంచో ఒక నమ్మకమైన బ్రాండ్‌గా నిలిచింది. కస్టమర్లలో నమ్మకం కలిగించడం, మైలేజ్, పనితీరు, అలాగే పనితీరు పరంగా ఈ కంపెనీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దేశీయ మార్కెట్లో ఇప్పటికే ఎన్నో మోడల్స్‌ను విజయవంతంగా విక్రయిస్తున్న టయోటా, ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో కూడా మంచి మార్కెట్‌ను సాధించింది. ఇందులో ముఖ్యంగా గ్లాంజా (Glanza) మోడల్ వినియోగదారులలో విశేష ఆదరణ పొందుతోంది. స్మూత్ డ్రైవింగ్ అనుభవం, ఆకర్షణీయమైన డిజైన్, లేటెస్ట్ ఫీచర్లు, టయోటా బ్రాండ్ నమ్మకం అన్ని కలిపి ఈ కారు కొనుగోలుదారులను ప్రధానంగా ఆకర్షిస్తుంది. ఇక తాజాగా ఈ కారు ధరలో మార్పు జరిగినట్లు సమాచారం. కొత్త టయోటా గ్లాంజా హ్యాచ్‌బ్యాక్ ధరను కంపెనీ సవరించింది.

సిటీ డ్రైవ్‌కీ, లాంగ్ రైడ్‌కీ పర్ఫెక్ట్ చాయిస్.. వోల్వో EX30 రివ్యూ!

వోల్వో EX30 భారతదేశంలో ₹59.90 లక్షల ప్రారంభ ధరతో ప్రారంభించబడింది. ఫీచర్లు, శ్రేణి మరియు కొనుగోలు చేయాలా వద్దా అనే దాని గురించి తెలుసుకోండి.
Advertisement

పెట్రోల్ కార్లలో బెస్ట్ మైలేజ్ ఇచ్చే టాప్ 5 కార్లు

కొత్త కారు కొనాలని ఆలోచిస్తున్నారా? మీ బడ్జెట్ తక్కువగా ఉందా? అయితే, మీ కోసమే హ్యుందాయ్ నుంచి ఒక అద్భుతమైన ఆప్షన్ ఉంది. కేవలం రూ. 6 లక్షలకే అదిరిపోయే ఫీచర్స్, ఎక్కువ మైలేజ్, పూర్తి భద్రతతో కూడిన ఒక ఎస్‌యూవీని హ్యుందాయ్ అందిస్తోంది. అదే హ్యుందాయ్ ఎక్స్‌టర్.