2026లో మీరు కొనదగ్గ టాప్-10 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే

పెట్రోల్ ధరలు మండిపోతున్న తరుణంలో సామాన్యుడి చూపు ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల (EV) వైపు మళ్లింది. ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయంగా ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇలాంటి సమయంలో ఒక్క రూపాయి పెట్రోల్ ఖర్చు లేకుండా, తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించే ఎలక్ట్రిక్ స్కూటర్లు మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. 2026 నాటికి భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న టాప్-10 బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ల పూర్తి వివరాలు తెలుసుకుందాం.

లీటర్ పెట్రోల్‌తో 28 కిమీకు పైగా మైలేజీ ఇచ్చే టాప్-5 కార్లు

భారతదేశంలో మధ్యతరగతి కుటుంబం కారు కొనాలనుకుంటే మొదట చూసేది మైలేజ్. పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ, తక్కువ ఇంధనంతో ఎక్కువ దూరం ప్రయాణించే కార్లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. అందుకే దిగ్గజ కార్ల తయారీ సంస్థలు ఇప్పుడు అదిరిపోయే మైలేజ్ ఇచ్చే కార్లను మార్కెట్లోకి తెస్తున్నాయి. 2026 నాటికి భారత మార్కెట్లో లీటర్ పెట్రోల్‌కు ఏకంగా 28 కిలోమీటర్లకు పైగా మైలేజ్ ఇచ్చే టాప్-5 కార్ల వివరాలు, వాటి ఫీచర్లు, ధరల గురించి వివరంగా తెలుసుకుందాం.

బడ్జెట్ బైక్‌లో బిగ్ బ్లాస్ట్.. షైన్ 100 అమ్మకాల దుమ్ము!

భారత టూవీలర్ రంగంలో నాణ్యత, నమ్మకం అనే పదాలు వినిపించగానే ముందుగా గుర్తుకు వచ్చే బ్రాండ్ హోండా (Honda). అదే నమ్మకాన్ని కొనసాగిస్తూ, సాధారణ వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చిన మోడల్ హోండా షైన్ 100 (Honda Shine 100). తక్కువ ఖర్చుతో, సులభమైన రైడింగ్ అనుభవంతో అందుబాటులో ఉన్న ఈ బైక్, చాలా తక్కువ సమయంలోనే దేశవ్యాప్తంగా విపరీతమైన ఆదరణను సంపాదించింది. పట్టణాల్లో ఉద్యోగాలకు వెళ్లే వారికి ఇది ఒక సౌకర్యవంతమైన ప్రయాణ వాహనంగా మారగా, గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు, చిన్న వ్యాపారులకు ఇది రోజువారీ అవసరాలను తీర్చే నమ్మకమైన వాహనంగా నిలిచింది. సింపుల్ డిజైన్, మంచి మైలేజ్, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులు కలిసి హోండా షైన్ 100ను ప్రతి వర్గానికీ దగ్గర చేసింది.

ఫ్యామిలీతో లాంగ్ ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నవారికి బెస్ట్ ఆప్షన్లు

కొత్త కారు కొనేటప్పుడు చాలా మంది కేవలం సీటింగ్ కెపాసిటీ మాత్రమే కాదు, దాని ఉపయోగకరతను కూడా గమనిస్తారు. ఐదుగురు కూర్చోవచ్చా అనే విషయం తో పాటు, మైలేజ్ ఎంత ఇస్తుంది, మెయింటెనెన్స్ ఖర్చు ఎలా ఉంటుంది, రీసేల్ విలువ ఎంత ఉంటుంది వంటి అంశాలు కూడా ముఖ్యంగా చూస్తారు. అంతేకాకుండా, ప్రయాణాల్లో సామాన్లు పెట్టుకునే ట్రంక్ స్పేస్ కూడా భారతీయ వినియోగదారులకు చాలా కీలకం. ఫ్యామిలీతో ట్రిప్స్‌కు వెళ్లేటప్పుడు లేదా రోజువారీ అవసరాలకు సరిపడా లగేజ్ స్పేస్ ఉండటం పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది. ఈ కారణాల వల్లనే చాలా మంది SUVలను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం మార్కెట్లో మంచి గ్రౌండ్ క్లియరెన్స్‌తో పాటు విస్తృతమైన ట్రంక్ స్పేస్ ఇచ్చే అనేక SUVలు అందుబాటులో ఉన్నాయి. ఆ కార్ల గురించి ఈ కింది కథణంలో.
Advertisement

బైక్ అంటే ఇదే..వంగి డ్రైవ్ చేస్తే వచ్చే ఆ కిక్కే వేరు

ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ తన పవర్‌ఫుల్ రోడ్‌స్టర్ గెరిల్లా 450ని సరికొత్త హంగులతో 2026 ఎడిషన్‌గా మార్కెట్లోకి విడుదల చేసింది. ఈసారి కేవలం రంగులు మార్చడమే కాకుండా, రైడింగ్ ప్రియుల కోసం అపెక్స్ (Apex) అనే సరికొత్త స్పోర్టియర్ వేరియంట్‌ను కూడా పరిచయం చేసింది. మెరుగైన టైర్లు, అదిరిపోయే ఎర్గోనామిక్స్‌తో వచ్చిన ఈ బైక్ ప్రారంభ ధర రూ.2.49 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ 125 ఏళ్ల మైలురాయిని చేరుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఈ అప్‌డేటెడ్ వెర్షన్‌ను కంపెనీ లాంచ్ చేయడం విశేషం.

ఈ 5 కార్లు ఉంటే 1000 కి.మీ ప్రయాణం ఆలోచించకుడా వెళ్లొచ్చు

చల్లని జల్లులు కురుస్తున్నప్పుడు కారులో లాంగ్ డ్రైవ్ వెళ్లడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు.. కానీ, వర్షాకాలంలో రోడ్డు ప్రయాణం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో, అంతే ప్రమాదకరంగా కూడా ఉంటుంది. ముఖ్యంగా 1000 కిలోమీటర్ల వంటి సుదీర్ఘ ప్రయాణాలు చేసేటప్పుడు చినుకులతో పాటు వచ్చే చిక్కులు (జారుడు రోడ్లు, భారీ నీటి గుంతలు) మామూలుగా ఉండవు. ఇలాంటి సమయంలో మనల్ని, మన కుటుంబాన్ని కాపాడేది కారులోని సేఫ్టీ ఫీచర్లు మాత్రమే. అందుకే వర్షాకాలం ట్రిప్పుల కోసం సేఫ్టీలో 5-స్టార్ రేటింగ్ పొందిన, తిరుగులేని పట్టున్న 5 బెస్ట్ కార్ల వివరాలు తెలుసుకుందాం.

షోరూమ్‌లలోకి ఎంట్రీ ఇచ్చిన కొత్త ఎక్స్‌టర్.. HX6 వేరియంట్ స్పాట్!

భారత కార్ల మార్కెట్లో తన ప్రత్యేకమైన స్టైల్, ఫీచర్లతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హ్యూందాయ్ (Hyundai) ఇటీవల తన ప్రజాదరణ పొందిన మోడల్ హ్యూందాయ్ ఎక్స్‌టర్ (Hyundai Exter) ను మరింత అప్‌డేట్ చేసి మార్కెట్లోకి తీసుకొచ్చింది. మారుతున్న కాలానికి అనుగుణంగా వినియోగదారుల అభిరుచులను దృష్టిలో పెట్టుకుని, 2026 ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను విడుదల చేయడం ద్వారా కంపెనీ మరోసారి తన పోటీ శక్తిని చూపించింది. ఈ కొత్త ఎక్స్‌టర్‌లో సరికొత్త ఫీచర్లు, మెరుగైన డిజైన్ ఎలిమెంట్స్‌ను జోడిస్తూ, పెరుగుతున్న పోటీకి సమాధానంగా హ్యుందాయ్ ఈ అప్‌గ్రేడ్‌ను తీసుకువచ్చింది. చిన్న SUV సెగ్మెంట్‌లో పోటీ రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో, ఈ మోడల్‌ను ఎక్కువ కాలం మార్కెట్లో నిలబెట్టే లక్ష్యంతో కంపెనీ ముందుకు వచ్చింది.

మార్కెట్లోకి రాబోతున్న 6 పవర్‌ఫుల్ ఎస్‌యూవీలివే

డీజిల్ ఇంజిన్ అంటేనే ఒక రకమైన పవర్, లాంగ్ జర్నీలో ఇచ్చే నమ్మకం. అందుకే మార్కెట్లో ఎన్ని ఎలక్ట్రిక్ కార్లు వచ్చినా, డీజిల్ ఎస్‌యూవీల (Diesel SUVs) క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం భారత మార్కెట్లోకి టాప్ బ్రాండ్ల నుంచి 6 పవర్ఫుల్ డీజిల్ ఎస్‌యూవీలు రాబోతున్నాయి. వీటిలో మహీంద్రా, టయోటా, స్కోడా వంటి దిగ్గజ సంస్థల కార్లు ఉన్నాయి. ఆ కార్ల వివరాలు తెలుసుకుందాం.
Advertisement

దేశంలో ఈ స్కూటర్ అంటే నచ్చని వారు ఎవరూ ఉండరు

భారత టూవీలర్ మార్కెట్లో స్కూటర్ అంటే ముందుగా గుర్తుకు వచ్చే పేరు హోండా యాక్టివా (Honda Activa). ఈ పేరు వినగానే చాలా మందికి నమ్మకం, మైలేజ్ గుర్తుకు రావడం సహజం. కాలక్రమేణా యాక్టివా కేవలం ఒక వాహనం మాత్రమే కాకుండా, ప్రతి ఇంటి రోజువారీ జీవితంలో భాగమైపోయింది. నగరాల్లోనూ, గ్రామాల్లోనూ ఒకే రీతిలో ఆదరణ పొందుతూ, దేశంలోని నంబర్ వన్ స్కూటర్‌గా తన స్థానాన్ని దృఢంగా నిలబెట్టుకుంది. ఈ ప్రాచుర్యానికి తగినట్టుగానే యాక్టివా అమ్మకాలు కూడా నిరంతరం బలంగా కొనసాగుతున్నాయి. తాజాగా విడుదలైన గణాంకాలు చూస్తే, 2026 ఫిబ్రవరి నెలలో ఈ స్కూటర్ ఏకంగా 2,54,449 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది.

ట్రాఫిక్‎లో ఇక టెన్షన్ వద్దు.. బెస్ట్ ఆటోమేటిక్ కార్లు ఇవే

భారతదేశంలో కార్ల మార్కెట్ ముఖచిత్రం వేగంగా మారిపోతోంది. ఒకప్పుడు ఆటోమేటిక్ కార్లు అంటే కేవలం ధనవంతులకు మాత్రమే పరిమితం అనే భావన ఉండేది. కానీ, నేడు ట్రాఫిక్ కష్టాలు పెరగడంతో మధ్యతరగతి ప్రజలు కూడా క్లచ్ తలనొప్పి లేని ఆటోమేటిక్ కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా ఎస్‌యూవీ (SUV) మోజు పెరగడంతో, తక్కువ ధరలో లభించే ఆటోమేటిక్ ఎస్‌యూవీలకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. మరి ప్రస్తుతం ఇండియాలో అత్యంత తక్కువ ధరకు లభిస్తున్న టాప్-5 ఆటోమేటిక్ ఎస్‌యూవీలేంటో, వాటి ప్రత్యేకతలేంటో వివరంగా తెలుసుకుందాం.

సెన్సేషన్ క్రియేట్ చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్

దేశీయ టూవీలర్ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) మరోసారి తన దూకుడు కొనసాగిస్తోంది. కేవలం క్లాసిక్ స్టైల్ బైకులు మాత్రమే కాకుండా, వినియోగదారుల నమ్మకాన్ని గెలుచుకున్న బ్రాండ్‌గా కూడా ఇది నిలుస్తోంది. ఈ నేపథ్యంలో అమ్మకాల పరంగా కొత్త రికార్డులు సృష్టిస్తూ ముందుకు సాగుతోంది. తాజాగా వెలువడిన గణాంకాల ప్రకారం, FY2026 ఆర్థిక సంవత్సరంలో మొదటి 11 నెలల కాలంలోనే రాయల్ ఎన్‌ఫీల్డ్ మొత్తం 10,06,937 యూనిట్ల బైకులను విక్రయించి అద్భుతమైన మైలురాయిని అందుకుంది. ఈ సంఖ్య కేవలం ఒక గణాంకం మాత్రమే కాదు, కంపెనీ మార్కెట్లో ఎంతటి పట్టు సాధించిందో తెలియజేసే బలమైన సూచిక.

ఇది కదా కస్టమర్ల మైండ్ బ్లాక్ అయ్యే ఆఫర్

ఎలక్ట్రిక్ టూ-వీలర్ రంగంలో సంచలనాలు సృష్టించే ఓలా ఎలక్ట్రిక్ (OLA Electric), మరోసారి కస్టమర్ల మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్‌లో అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. #EndICEAge పేరుతో మొదలుపెట్టిన ఈ కొత్త క్యాంపెయిన్ ద్వారా సామాన్యుడికి కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ అందుబాటులోకి రావాలని ఓలా భావిస్తోంది. కేవలం రూ.49,999 ప్రారంభ ధరతోనే స్కూటర్లు, బైక్‌లను ఆఫర్ చేయడమే కాకుండా.. ఏకంగా రూ.50,000 వరకు బెనిఫిట్స్ అందిస్తూ మార్కెట్‌ను షేక్ చేస్తోంది. ఈ ఆఫర్ కేవలం మార్చి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉండనుంది.
Advertisement

పెట్రోల్ ఖర్చు తగ్గించాలంటే ఇదే ఆప్షన్

భారతీయుల రోజువారీ ప్రయాణాల్లో నమ్మకమైన భాగస్వామిగా నిలిచిన బైక్‌లలో బజాజ్ ప్లాటినా (Bajaj Platina) ఒకటి. మంచి మైలేజ్, తక్కువ నిర్వహణ ఖర్చులు, సరసమైన ధర ఈ మూడు అంశాలు కలిపి ఈ బైక్‌ను నగరాల్లోనే కాకుండా చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా విపరీతంగా ప్రాచుర్యం పొందేలా చేశాయి. ఉద్యోగాలకు వెళ్లే వారు, చిన్న వ్యాపారులు, గ్రామాల్లో రోజువారీ పనులు చూసుకునే వారు.. ఇలా విభిన్న వర్గాల ప్రజలకు ఇది ఎంతో ఉపయోగకరంగా మారింది. ప్రస్తుతం పెట్రోల్ ధరలు పెరుగుతున్న పరిస్థితుల్లో, ఖర్చులను తగ్గించుకోవాలని చూస్తున్న వారికి ఈ బైక్ మరింత ఆకర్షణీయంగా మారుతోంది. తక్కువ ఇంధనంతో ఎక్కువ దూరం ప్రయాణించే సామర్థ్యం ఉండటంతో, చాలా మంది కొత్తగా బైక్ కొనాలనుకున్నప్పుడు ప్లాటినానే ఎంపికగా తీసుకుంటున్నారు.

టైగన్ మళ్లీ రీ-ఎంట్రీ.. ఈసారి మరింత స్టైలిష్‌గా

ఇటీవలి కాలంలో భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఒక స్పష్టమైన ట్రెండ్ కనిపిస్తోంది, అదే ఫేస్‌లిఫ్ట్ మోడళ్ల వరద. కొత్త కారు కొనాలనుకునే వినియోగదారుల అభిరుచులు వేగంగా మారుతున్న నేపథ్యంలో, తయారీదారులు కూడా తమ ఇప్పటికే ఉన్న మోడళ్లను మరింత స్టైలిష్‌గా, టెక్నాలజీ పరంగా అప్‌డేట్ చేస్తూ మళ్లీ మార్కెట్లోకి తీసుకువస్తున్నారు. ఈ ట్రెండ్‌లో భాగంగానే ఇటీవల స్కోడా కుషాక్ (Skoda Kushaq) ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ విడుదలై మంచి స్పందనను అందుకుంది. ఇదే విధానాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు ఫోక్స్‌వ్యాగన్ (Volkswagen) కూడా తన ప్రాచుర్యం పొందిన మిడ్-సైజ్ SUV అయిన టైగన్ (Taigun) ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను భారత మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది.

సామాన్యుడికి షాక్..పెట్రోల్ పై రూ.5, డీజిల్ పై రూ.3 పెంపు

మధ్యప్రాచ్యంలో ముదురుతున్న యుద్ధ జ్వాలలు సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన సైనిక దాడుల నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు ఆకాశాన్ని తాకాయి. ఈ భారాన్ని తట్టుకోలేక దేశీయ అతిపెద్ద ప్రైవేట్ ఇంధన విక్రయ సంస్థ నయారా ఎనర్జీ (Nayara Energy) కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచుతూ గురువారం (మార్చి 26, 2026) ప్రకటన చేసింది.

ఒక్క రోజు 101 కార్లు డెలివరీ చేసి టాటా డీలర్ రికార్డ్

Tata Sierra : భారతీయ ఆటోమొబైల్ రంగంలో టాటా మోటార్స్ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. పాత జ్ఞాపకాలను సరికొత్త హంగులతో వెండితెరపైకి తెచ్చినట్లుగా, టాటా సియెర్రా (Tata Sierra) ఎస్‌యూవీని మార్కెట్లోకి తెచ్చి కస్టమర్లను మంత్రముగ్ధులను చేస్తోంది. తాజాగా గుజరాత్‌లో జరిగిన ఒక సంఘటన టాటా సియెర్రాకు ఉన్న క్రేజ్‌ను అద్దం పడుతోంది. అహ్మదాబాద్‌లోని ఒక టాటా డీలర్ కేవలం ఒక్క రోజులోనే ఏకంగా 101 సియెర్రా ఎస్‌యూవీలను కస్టమర్లకు డెలివరీ చేసి రికార్డు సృష్టించారు. ఈ భారీ డెలివరీ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను టాటా మోటార్స్ స్వయంగా తన అధికారిక యూట్యూబ్ ఛానల్‌లో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలో ఉన్న టాటా డీలర్‌షిప్ వద్ద పండుగ వాతావరణం నెలకొంది. తమ అభిమాన ఎస్‌యూవీ కోసం నెలల తరబడి వేచి చూసిన కస్టమర్లకు ఒకేసారి సర్ ప్రైజ్ ఇవ్వాలని డీలర్ నిర్ణయించారు. దీనికోసం ప్రత్యేకంగా ఒక వేడుకను ఏర్పాటు చేసి, ఏకకాలంలో 101 టాటా సియెర్రా కార్లను డెలివరీ చేశారు. వరుసగా నిలబెట్టిన తెల్లటి, బూడిద రంగు సియెర్రాల మధ్య కస్టమర్లు తమ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి కార్ల తాళాలను అందుకున్నారు. ఈ దృశ్యం అద్భుతంగా ఉండటంతో టాటా మోటార్స్ కూడా దీనిని గర్వంగా సోషల్ మీడియాలో పంచుకుంది. కేవలం అహ్మదాబాద్‌లోనే కాకుండా, గత వారం మధ్యప్రదేశ్ డీలర్ కూడా ఇలాగే వందకు పైగా కార్లను డెలివరీ చేయడం విశేషం. గత ఏడాది నవంబర్‌లో లాంచ్ అయిన టాటా సియెర్రాకు బుకింగ్‌లు వెల్లువెత్తుతున్నాయి. జనవరి 2026 నుంచి డెలివరీలను ప్రారంభించిన టాటా మోటార్స్, కేవలం మూడు నెలల వ్యవధిలోనే సుమారు 14,000 యూనిట్లను కస్టమర్ల చేతిలో పెట్టింది. పాతసియెర్రా మోడల్‌కు ఉన్న సెంటిమెంట్‌కు తోడు, ఆధునిక టెక్నాలజీని జోడించడంతో యువత కూడా ఈ కారు వైపు మొగ్గు చూపుతోంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న డిమాండ్ కారణంగా ఈ ఎస్‌యూవీకి వెయిటింగ్ పీరియడ్ కూడా గణనీయంగా పెరిగింది. అయినా సరే, కస్టమర్లు దీని కోసమే వేచి చూడటం విశేషం.
Advertisement

యువత ఫేవరెట్ బైక్ మళ్లీ హిట్.. FZ సేల్స్ రికార్డ్ లెవెల్‌కు!

భారతీయ యువతలో స్టైలిష్ లుక్, మస్క్యులర్ డిజైన్, స్మూత్ రైడింగ్ అనుభవంతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న బైక్‌లలో యమహా ఎఫ్‌జెడ్ (Yamaha FZ) ఒకటి. నగర రోడ్లపై యువత ఎక్కువగా ఎంచుకునే ఈ బైక్, ఇటీవలి కాలంలో మళ్లీ తన సేల్స్ గ్రాఫ్‌ను గట్టిగా పెంచుకుంటూ మార్కెట్లో తన స్థానం బలపరుస్తోంది. దానికి తాజా ఉదాహరణగా 2026 ఫిబ్రవరి అమ్మకాల గణాంకాలు నిలిచాయి. ఈ ఒక్క నెలలోనే దేశవ్యాప్తంగా మొత్తం 16,852 యూనిట్లు అమ్ముడవడం గమనార్హం. ఇది కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు, యమహా FZ పై వినియోగదారుల నమ్మకం మళ్లీ పెరుగుతోందనే సంకేతం. ముఖ్యంగా గత ఏడాది ఇదే కాలాన్ని తీసుకుంటే, పరిస్థితి ఎంత మారిందో స్పష్టంగా తెలుస్తుంది.

ఆటోమొబైల్ చరిత్రలో మారుతి సరికొత్త రికార్డు

భారతదేశ ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. కేవలం కార్ల అమ్మకాల్లోనే కాకుండా, వాటిని కస్టమర్ల వద్దకు చేరవేసే లాజిస్టిక్స్ విధానంలో కూడా ఈ సంస్థ విప్లవాత్మక మార్పులు చేస్తోంది. హర్యానాలోని మారుతీ సుజుకీకి చెందిన మానేసర్ ఇన్-ప్లాంట్ రైల్వే సైడింగ్ కార్యకలాపాలు ప్రారంభించిన కేవలం 9 నెలల వ్యవధిలోనే ఒక లక్ష వాహనాలను రైళ్ల ద్వారా డిస్పాచ్ చేసి అరుదైన మైలురాయిని చేరుకుంది. ఇది కేవలం వ్యాపార పరంగానే కాకుండా, పర్యావరణ పరిరక్షణలో కూడా పెద్ద విజయం అని చెప్పాలి.

దేశాన్ని కైవసం చేసుకున్న బైక్.. స్ప్లెండర్ అమ్మకాలు దుమ్మురేపుతున్నాయి

భారతీయుల దైనందిన జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయిన బైక్‌లలో ఒకటి హీరో స్పెండ్లర్ (Hero Splendor). సాధారణ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించబడిన ఈ బైక్, జాతీయ బైక్ అన్న పేరు తెచ్చుకోవడం యాదృచ్ఛికం కాదు. తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్, సింపుల్ మెయింటెనెన్స్, నమ్మకమైన పనితీరు ఈ మూడు లక్షణాలు స్ప్లెండర్‌ను కోట్లాది భారతీయుల మొదటి ఎంపికగా నిలబెట్టాయి. ఇప్పటికీ అదే ట్రెండ్ కొనసాగుతోంది. ముఖ్యంగా 2026 ఫిబ్రవరిలో ఈ బైక్ నమోదు చేసిన అమ్మకాలు చూస్తే, స్ప్లెండర్ ప్రభావం ఎంత గొప్పదో స్పష్టంగా అర్థమవుతుంది. కేవలం ఒక్క నెలలోనే దేశవ్యాప్తంగా 3,21,952 యూనిట్లు అమ్ముడవడం చిన్న విషయం కాదు. అంటే ప్రతి రోజు సగటున 10,700కు పైగా బైక్‌లు రోడ్డెక్కుతున్నాయంటే, ఇది ఒక రికార్డ్ స్థాయి డిమాండ్‌గా చెప్పాలి.

లక్షన్నర కార్ల తయారీ లక్ష్యంగా వియత్నం కంపెనీ

వియత్నాంకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల దిగ్గజం విన్‌ఫాస్ట్ (VinFast) భారత మార్కెట్‌లోకి అత్యంత వ్యూహాత్మకంగా అడుగుపెడుతోంది. కేవలం కార్లను అమ్మి వెళ్ళిపోవడానికి కాకుండా, ఇక్కడ ఒక భారీ సామ్రాజ్యాన్ని నిర్మించడమే లక్ష్యంగా ఈ సంస్థ అడుగులు వేస్తోంది. ఇటీవల డ్రైవ్‌స్పార్క్ రివ్యూస్ ఎడిటర్ ప్రోమీత్ ఘోష్ వియత్నాంలోని విన్‌ఫాస్ట్ ప్రధాన తయారీ కేంద్రమైన హై ఫాంగ్‎ను సందర్శించారు. అక్కడ ఆయన చూసిన రోబోటిక్ టెక్నాలజీ, అత్యాధునిక తయారీ విధానం విన్‌ఫాస్ట్ అంతర్జాతీయ స్థాయిని చాటి చెబుతున్నాయి. సుమారు 1,200 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ప్లాంట్‌ను కేవలం 21 నెలల్లోనే నిర్మించారంటే, ఆ సంస్థ వేగం, పట్టుదల ఏంటో అర్థం చేసుకోవచ్చు.
Advertisement

ఒక లీటరు పెట్రోల్‌తో సూపర్ మైలేజ్

భారతీయ SUV మార్కెట్లో ఒకప్పుడు తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న రెనాల్ట్ డస్టర్ (Renault Duster), కొంతకాలం విరామం తర్వాత మళ్లీ కొత్త అవతారంలో ఎంట్రీ ఇచ్చింది. ఈసారి మరింత ఆధునిక డిజైన్, శక్తివంతమైన ఇంజిన్ ఆప్షన్లు, మెరుగైన మైలేజీతో SUV ప్రియుల మనసు గెలుచుకునేలా తిరిగి వచ్చింది. ప్రారంభ ధరను రూ. 10.49 లక్షలుగా నిర్ణయించిన కంపెనీ, ప్రత్యేకంగా ఆర్-పాస్ ద్వారా బుక్ చేసుకునే వారికి రూ. 10.29 లక్షలకే అందిస్తామని ప్రకటించడం మరింత ఆకర్షణగా మారింది. కొత్త డస్టర్‌లో డీజిల్ ఇంజిన్‌కు పూర్తిగా గుడ్‌బై చెప్పి, పూర్తిగా పెట్రోల్ ఇంజిన్‌లపై దృష్టి పెట్టింది Renault. ప్రస్తుతం ఇది రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులోకి వచ్చింది. ఒకటి 1-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ కాగా, మరొకటి 1.3-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్.

టాటా సియెర్రా మైలేజ్ గుట్టు రట్టు

టాటా మోటార్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా పునఃప్రారంభించిన టాటా సియెర్రా(Tata Sierra) ప్రస్తుతం ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్‌లో సెన్సేషన్ సృష్టిస్తోంది. 2025 నవంబర్‌లో గ్రాండ్‌గా లాంచ్ అయిన ఈ ఎస్‌యూవీ మైలేజీకి సంబంధించి ఇప్పటివరకు కంపెనీ అధికారికంగా ఎలాంటి గణాంకాలు వెల్లడించలేదు. అయితే, తాజాగా ఒక ఆర్‌టీఐ (RTI) ద్వారా ఏఆర్‌ఏఐ (ARAI) సర్టిఫైడ్ మైలేజ్ వివరాలు బయటకు వచ్చాయి. ఈ వివరాల ప్రకారం పెట్రోల్ వేరియంట్ కంటే డీజిల్ వేరియంట్ మైలేజీ పరంగా అదరగొడుతోందని తెలుస్తోంది. టర్బో పెట్రోల్ ఇంజిన్ మాత్రం ఆశించిన స్థాయిలో మైలేజీ ఇవ్వడం లేదన్న చర్చ నడుస్తోంది.

మెల్లగా వచ్చి ఇప్పుడు టాప్‌లోకి దూసుకొస్తున్న చేతక్

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతున్న సమయంలో, బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ (Bajaj Chetak) తన ప్రత్యేక గుర్తింపుతో ముందుకు దూసుకుపోతోంది. క్లాసిక్ డిజైన్‌ను ఆధునిక టెక్నాలజీతో మేళవించిన ఈ స్కూటర్, వినియోగదారుల హృదయాలను గెలుచుకుంటూ, మార్కెట్లో స్థిరమైన డిమాండ్‌ను కొనసాగిస్తోంది. ఫిబ్రవరి 2026 అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే, చేతక్ పనితీరు ఎంత బలంగా ఉందో స్పష్టంగా తెలుస్తుంది. ఆ నెలలో మొత్తం 28,004 యూనిట్లు అమ్ముడవడం ఒక పెద్ద విజయంగా చెప్పుకోవచ్చు. ఇదే సమయంలో గత సంవత్సరం ఫిబ్రవరి 2025లో 21,240 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. అంటే కేవలం ఒక ఏడాదిలోనే 6,764 యూనిట్ల అదనపు అమ్మకాలు నమోదయ్యాయి.

IPL సీజన్‌కి ముందే షాక్.. హీరో విడా VX2 ప్లస్ KKR ఎడిషన్ టీజర్ రిలీజ్

క్రికెట్ పండుగలా భావించే ఐపీఎల్ 2026 (IPL 2026) ప్రారంభానికి ముందు నుంచే దేశవ్యాప్తంగా ఉత్సాహం పెరిగిపోతుంది. ఇదే వేళ, అభిమానుల ఆ ఎగ్జైట్‌మెంట్‌ను మరోస్థాయికి తీసుకెళ్లేందుకు హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) ఒక ఆసక్తికరమైన అడుగు వేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థగా గుర్తింపు పొందిన ఈ కంపెనీ, క్రికెట్, ఎలక్ట్రిక్ మొబిలిటీని కలిపి ఒక కొత్త అనుభవాన్ని అందించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (Kolkata Knight Riders) అభిమానుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఒక లిమిటెడ్ ఎడిషన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను పరిచయం చేయబోతోంది, అదే హీరో విడా వీఎక్స్‌2 ప్లస్ నైట్ ఎడిషన్ (Hero Vida VX2 Plus Night Edition).
Advertisement

ఫిబ్రవరిలో టాప్ ఎంపీవీలు ఇవే.. ఎర్టిగా టాప్, ఇన్నోవా, కారెన్స్ పోటీ!

కరోనా తరువాత కాలంలో ప్రజల జీవనశైలిలో వచ్చిన మార్పులు ఆటోమొబైల్ మార్కెట్‌పైనా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కుటుంబంతో కలిసి ప్రయాణాలు చేసే ట్రెండ్ పెరగడంతో, ఎక్కువ సీటింగ్ సామర్థ్యం ఉన్న వాహనాలపై డిమాండ్ గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఎంపీవీ (Multi Purpose Vehicle) సెగ్మెంట్ మళ్లీ బలంగా నిలబడుతూ, కుటుంబ అవసరాలకు సరిపోయే ప్రాక్టికల్ ఆప్షన్‌గా మారింది. ఒకప్పుడు SUVల హవా ఎక్కువగా ఉన్నప్పటికీ, ఇప్పుడు పెద్ద కుటుంబాల కోసం సౌకర్యవంతమైన సీటింగ్, ఎక్కువ లెగ్‌రూమ్, ప్రయాణంలో సౌలభ్యం వంటి అంశాలు ప్రధానంగా మారాయి. ఇవన్నీ కలిపి ఎంపీవీ కార్లను మళ్లీ ముందుకు తీసుకువచ్చాయి. నగరాల్లోనూ, గ్రామీణ ప్రాంతాల్లోనూ ఒకే విధంగా ఉపయోగపడే ఈ వాహనాలు ఇప్పుడు చాలా మందికి ఫస్ట్ ఛాయిస్‌గా మారుతున్నాయి.